ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం సూర్యవంశీ వైభవ్ అదిరిపోయే ఆటతో అందరినీ షాక్కు గురి చేశాడు. వయసు కేవలం 14 సంవత్సరాల 32 రోజులు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. టీనేజ్లోనే ఇలా మెరుపులు మెరిపించడం అరుదైన ఘనతగా నిలిచింది.
వైభవ్ ఇన్నింగ్స్ చూస్తుంటే నిశ్శబ్దం లేకుండా స్టేడియం ఉలిక్కిపడింది. 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇందులో 11 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. పవర్ ప్లేలోనే వాషింగ్టన్ సుందర్ ఓవర్ను ఛేదించి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కరీం జనత్ ఓవర్లో 30 పరుగులు తీసి గేమ్ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేశాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు వైభవ్. మొదటి స్థానంలో క్రిస్ గేల్ (30 బాల్స్ సెంచరీ) ఉన్నాడు. అంతేకాదు, గుజరాత్ స్టార్ బౌలర్లయిన ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ, రషీద్ ఖాన్ బౌలింగ్కి చెమటలు పట్టించాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మ్యాచ్ విషయానికి వస్తే, గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 209 పరుగులు చేశారు. గిల్ 84(50), బట్లర్ 50(32) పరుగులతో గుజరాత్కు గట్టి స్కోరు అందించారు. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జైస్వాల్ 70(40), వైభవ్ 101(38) రన్లతో ప్రత్యర్థిని పాతాళానికి తీయడం విశేషం. చివరగా రియన్ పరాగ్ సిక్స్ బాది మ్యాచ్ ముగించాడు.
ఇంత చిన్న వయసులో అంతటి సంచలనం సృష్టించిన వైభవ్ పై ఇప్పుడు అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. టాలెంట్ అబ్బురం అనిపించుకున్న ఈ బాలుడు రాబోయే రోజుల్లో టీమిండియాలో చోటు సంపాధించడం కాయమని చెబుతున్నారు. ఇక రాజస్థాన్ అతన్ని 1.1కోట్లకు వేలంలో దక్కించుకున్న విషయం తెలిసిందే.