పూరి జగన్నాధ్ కూడా ఇలా డిసైడయితే ఎలాంటి కామెంట్స్ వస్తాయో ..?

దర్శకుడు పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న ఆకాష్.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ సినిమా ఆశించినంతగా సక్సస్ కాలేదు. కాని ఆకాష్ కి మాత్రం హీరో మెటీరియల్ అని.. ఖచ్చితంగా మాస్ హీరోగా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోవడం ఖాయమన్న ప్రశంసలు దక్కించుకున్నాడు.

Mehbooba 2 Days Box Office Collections - tollywood

ఈ క్రమంలో ఆకాష్ పూరి హీరోగా రెండవ సినిమా ‘రొమాంటిక్’ తయారవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాలో ఆకాష్ కి జంటగా కేతికా శర్మ పరిచయం అవుతుండగా పూరి దగ్గర అసోసియేట్ గా చేసిన అనిల్ పాదూరి ఈ సినిమాని తెరకెక్కించాడు.

ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా రూపొందుతుండగా పూరి.. కథ, మాటలు అందించడం విశేషం. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో ఒక న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది.

Poster of Romantic Telugu movie, Grand Release On May 29th - See Latest

పూరి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తంలో ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. మరి పూరి ఆ డీల్ కి ఒప్పుకుంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తుంది. పూరి కూడా ఇలా ఓటీటీ వైపు చూస్తే ఎలా అని చెప్పుకుంటున్నారట. ఇక ఈ మధ్య ఓటీటీలో రిలీజైన సినిమాలు యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోతున్న సంగతి తెలిసిందే.