తారక్ తో టచ్ లోకి వెళ్ళాలంటే 2023 తర్వాతే.. అప్పటి వరకు ఎంత ట్రై చేసినా టైం వేస్ట్ ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పాన్ ఇండియన్ స్టార్ గా ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ క్రేజ్ రాబోతోందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ ఊహించని రేంజ్ లో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. నెస్క్ట్ ఆ రేంజ్ కి వెళ్ళబోతుంది తారక్ అంటున్నారు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ రిజల్ట్ ని ఊహించే తారక్ తన నెక్స్ట్ సినిమాల ప్రాజెక్ట్స్ ని లైనప్ చేసి పెట్టుకున్నాడు.

Jr NTR RRR Teaser: Komaram Bheem Teaser: రామరాజు ఫర్ భీమ్.. వాడి పొగరు  ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ - ramaraju for bheem:  ntr teaser released from rrr | Samayam Telugu

ఆర్ఆర్ఆర్ సినిమా కంప్లీటవగానే మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అయినను పోయిరావలె హసినకు అన్న వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించనున్నాయి. వాస్తవంగా ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా కాని కరోనా వల్ల ఆలస్యం అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2021 ఫిబ్రవరి లేదా మార్చ్ లో సెట్స్ మీదకి వెళ్ళబోతుందట.

ఇక కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. వాస్తవంగా ఈ సినిమా త్రివిక్రమ్ కంటే ముందే చేయాలి. కాని డేట్స్ సర్దుబాటు కాక ముందు త్రివిక్రమ్ సినిమా మొదలవబోతుందని సమాచారం. అట్లీ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే సినిమా కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. అలాగే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లోను ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు.

ఈ సినిమాల తర్వాత మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్వకత్వంలో ఎన్టీఆర్ నటించనున్నాడని సమాచారం. మహా నటి తర్వాత నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియన్ సినిమా మొదలవబోతోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా 2023లో ఎన్టీఆర్ – నాగ్ అశ్విన్ ల కాంబో లో వైజయంతి మూవీస్ కొత్త సినిమాని మొదలు పెడతారని అంటున్నారు. ఇలా మొతానికి ఎన్టీఆర్ వరస ప్రాజెక్ట్స్ తో 2023 – 2024 వరకు బిజీగా ఉంటాడని సమాచారం. ఆ తర్వాతే ఎవరైనా ఎన్టీఆర్ తో కొత్త ప్రాజెక్ట్ కి ట్రై చేయాల్సి ఉందట.