అలా వచ్చే హీరోయిన్స్‌ నాకు అవసరం లేదు: అనసూయ

అనసూయ భరద్వాజ్‌ చాలా ప్రాముఖ్యం వున్న వ్యక్తి, యాంకర్‌గా, నటిగా హోస్ట్‌ గా ఇలా చాలా పేరు సంపాదించింది. అనసూయ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో చాలా సినిమాల్లో మెప్పిస్తోంది. అందులో ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా చేసిన పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సినిమాల్లో ఎక్కువ బిజీ గా ఉంటూ చాలా సినిమాలు చేస్తోంది. అయితే ఆమెకి మొదట్లో చాలా సినిమాల్లో హీరోయిన్స్‌ ఛాన్స్‌ ఎందుకు రాలేదో అనే విషయం కూడా చెప్పింది అనసూయ.

ఈ విషయాలని ఒక యూట్యూబ్‌ ఛానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది అనసూయ. ‘అత్తారింటికి దారేది’ ఒక పాట కోసం దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చాలామంది చేత అనసూయకి చెప్పించారు. కానీ అనసూయ ఆ సినిమా చెయ్యను అని చెప్పేసింది. అందులో చాలామంది కథానాయికలు వున్నారు, ఆ గుంపులో నేనెందుకు చెయ్యడం అని చెయ్యలేదుట. అప్పట్లో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఆమెని ట్రోల్‌ చేశారు కూడా. ఆ తరువాత ఆమె త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కి సారీ చెప్పిందట. ఎందుకంటే అప్పుడు ఆమె ఆ పాట చెయ్యను అనే చెప్పే విధానం తప్పు అని అందుకని సారీ చెప్పాను అని అనింది.

అయితే అప్పట్లో తనకి లౌక్యం తెలియదు అని, మనసులో ఏది అనుకుంటే, ఏది చెప్పాలి అనుకుంటే అది చెప్పేస్తా అని, ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాను అని చెప్పింది. అయితే తాను ఏమి చెప్పాలని అనుకున్నానో అది చెప్పేస్తా కానీ, ఇంతకు ముందులా కాకుండా కొంచెం మార్చి చెప్తా అని అనింది. ఏదైనా ఒక ఇష్యూ మీద తాను చెప్పాలనుకున్నది మొహమాటం లేకుండా చెప్తాను అని కూడా చెప్పింది.

అలాగే తనకి హీరోయిన్‌ ఛాన్సెస్‌ కూడా ఎందుకు రాలేదు అన్న విషయం కూడా చెప్పింది. సినిమా తరువాత జరిగే కార్యకలాపాలకు నేను వ్యతిరేకం అని, అందుకే రాలేదని చెప్పింది. తాను పార్టీలకు దూరం అని చూపుతో, అలా వెళితేనే హీరోయిన్‌ ఛాన్సెస్‌ వస్తాయి అని అనుకోని కొన్నిసార్లు ట్రై చేసి వెళ్ళాను కూడా, కానీ అది నాకు నప్పదు అని తెలిసి దూరంగా వున్నా.

అలా చాలా హీరోయిన్స్‌ ఛాన్సెస్‌ కూడా మిస్‌ అయ్యాను. కానీ అవన్నీ మిస్‌ అయ్యానని ఎప్పుడూ బాధపడటం లేదు. ఆ తరువాత నా పని నచ్చితే నన్ను పిలుస్తారు అని అనుకున్నాను అని చెప్పింది అనసూయ. ఒకవేళ ఆ రకంగా హీరోయిన్‌ ఛాన్సెస్‌ వస్తాయి అంటే మాత్రం అవి నాకు అవసరం లేదు అని ఖరాకండిగా చెప్పేసింది అనసూయ. దర్శకుడు సుకుమార్‌ ‘ఆర్య 2’ తనకి ఆఫర్‌ ఇచ్చారని, అయితే అది ఎటువంటి పాత్ర అనేది తనకి తెలియదని చెప్పింది అనసూయ.