ఇక పై ప్రేమకథ సినిమాలలో నటించను.. దుల్కర్ డేసిషన్!

తమిళ్, మలయాళీ భాషలలో హీరోగా మంచి గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. దుల్కర్ సల్మాన్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి అనువదించి విడుదల చేశారు. ఈ సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దుల్కర్ సల్మాన్ కి హీరోగా మంచి గుర్తింపు ఏర్పడింది. మహానటి, కనులు కనులు దోచాయంటే, హే సినామిక వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. మహానటి సినిమాలో ఎంజిఆర్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ ఆ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగులో మొదటిసారిగా సీతారామం సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.

టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరికేక్కిన సీతారామం సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో హీరోగా అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. ఇక ఈ సినిమాలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఒక ఒరిజినల్ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ పనులు వేగవంతం చేశారు.

ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమా గురించి అనేక విషయాలను వెల్లడించాడు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. సీతారామం అనేది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ. ఇప్పటివరకు ఇలాంటి సినిమా నేను చూడలేదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది. ఈ సీతారామం సినిమా అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ క్రమంలో ఇకపై ప్రేమ కథలు చేయనన్నారని యాంకర్ ప్రశ్నించగా.. ‘రోజు రోజుకి నా వయసు పెరుగుతుంది. ఇంకా పరిణితి గల మంచి పాత్రలలో నటించాలని ఉంది. అందువల్లే ప్రేమ కథలకు కొంతకాలం విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ దుల్కర్ సల్మాన్ వెల్లడించాడు.