బ్లాస్టింగ్ కి సిద్దంగా ఉన్న విజయ్ అభిమానులు.. అప్రమత్తమైన పోలీసులు…?

సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందిన వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన విజయ్ దేవరకొండ తర్వాత పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారాడు. ఆ సినిమా మంచి హిట్ అయింది. సినిమా తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి, గీతాగోవిందం అంటే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా గుర్తింపు పొందాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ కి సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ లైగర్ ‘ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ప్రస్తుతం విజయ్ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ఇటీవల కాఫీ విత్ కరణ్ షో లో కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇటీవల విజయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రమోషనల్ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒక అభిమాని విజయ్ షేర్ చేసిన పోస్ట్ కి స్పందిస్తూ.. ‘ఇండియా బ్లాస్ట్ ఆన్ ఆగస్ట్ 25′ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కి స్పందించిన మరొక నెటిజన్ భారీ పేలుడు కోసం ప్లాన్ చేస్తున్నారు వీరిపై చర్యలు తీసుకోండి అంటూ హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు. అయితే హైదరాబాద్ పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకొని ..మేము కూడా అప్రమత్తంగా ఉన్నాం అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ చాట్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.