టాలీవుడ్‌పై మోజుపడ్డ హృతిక్ రోషన్.!

బ్యాక్ టు బ్యాక్ తెలుగు హీరోలతో సినిమాలు చేయబోతున్నాడట బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్. ఈ మార్పు ఎందుకోసం.? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో ‘వార్-2’ సినిమా చేస్తున్నాడు హృతిక్ రోషన్. ఇటీవల అల్లు అర్జున్‌తో భేటీ సందర్భంగా ఓ ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నాడట బాలీవుడ్ కండల వీరుడు.

అంతేనా.? లిస్టులో చాలా పేర్లున్నాయట. ఓ నాలుగైదు సినిమాల్ని సైత్ హీరోలతో హృతిక్ రోషన్ ప్లాన్ చేశాడంటున్నారు. అందరూ తెలుగు హీరోలేనట. ఇదంతా పాన్ ఇండియా మైలేజ్ కోసమేనా.? అంతేనేమో.!ట్రెండ్ మారింది.

ఇప్పుడు సౌత్, నార్త్ అన్న బౌండరీస్ లేవు. అంతా ఇండియన్ సినిమానే. సో, ఆహ్వానించదగ్గ పరిణామమే ఇది.! బాలీవుడ్ హీరోలతో మన హీరోలు మ్యాచ్ చేయడం కాదు, మన హీరోలతో బాలీవుడ్ హీరోలు మ్యాచ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హృతిక్‌తో నటించనున్న మరో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అని తెలుస్తోంది.

రామ్ చరణ్ – టైగర్ ష్రాఫ్ కాంబినేషన్‌లోనూ ఓ సినిమా రాబోతోందిట.