‘వార్‌-2’పై భారీ అంచనాలు!

టాలీవుడ్‌, బాలీవుడ్‌ మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ‘వార్ -2’. అయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో స్పై జోనర్‌లో వస్తోన్న ఈ మూవీలో గ్లోబల్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. ‘వార్‌ 2’ క్లై మాక్స్‌లో తారక్‌, హృతిక్‌ రోషన్‌ మధ్య స్టన్నింగ్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటుందని ఫైట్ మాస్టర్‌ అనల్‌ అరసు ఇప్పటికే ఓ అప్‌డేట్‌ ఇచ్చి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతుండగా.. తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

‘వార్‌ ‘2 సినిమాకే హైలెట్‌గా నిలిచే ఓ సీన్‌ ఉందట. ఇంతకీ అదేంటో తెలుసా..? హృతిక్‌ రోషన్‌, తారక్‌ మధ్య వచ్చే హై స్పీడ్‌ బోట్‌ ఛేజ్‌ సీక్వెన్స్‌. భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ చూడని విధంగా.. మరణ మృదంగం వాయిస్తున్నట్టుగా ఒళ్లు గగుర్పొడిచేలా ఈ యాక్షన్‌ సన్నివేశం ఉండబోతుందని బీటౌన్‌ సర్కిల్‌లో ఓ వార్త హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇటీవలే ఆరు రోజుల పాటు ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్టు సమాచారం. అయాన్‌ ముఖర్జీ టీం ఇప్పటికే లాంఛ్‌ చేసిన ‘వార్‌ 2’ గ్లింప్స్‌ నెట్టింట వైరల్‌ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ‘వార్‌ 2’ 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌ 3 సినిమాలుబిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. వీటి తర్వాత వస్తున్న ఆరో ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.