శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నది. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న జాన్వీ.. వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది.

అనంతరం ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నాయి. నటి శ్రీదేవికి తిరుమలతో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే.

ఇక తన తల్లిలానే జాన్వీకపూర్‌కి కూడా తిరుమల అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి ఏడాది ఆమె తిరుమల దర్శనానికి వస్తారు. ఇకపోతే ఆమె దేవర సినిమాలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్నారు.