సమంత కోసం దక్షణ కొరియా వెళ్లిన హీరో సిద్దార్థ్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదటి సినిమా మంచి హిట్ అవటంతో తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోని శాసన నటించిన అవకాశాలు అందుకని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన సమంత ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుని అక్కడ కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. సౌత్ , నార్త్ ఇండస్ట్రీలలో పాటు హాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది.

ఇదిలా ఉండగా గతంలో హీరో నాగచైతన్య ని ప్రేమించడానికి ముందు హీరో సిద్ధార్థ్ తో సమంత రిలేషన్షిప్ లో ఉన్నట్లు మీడియా కోడైకూసింది. చాలాకాలం ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లికి కూడా సిద్ధమైనట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరి జాతకంలో దోషాలు ఉండటం వల్ల వాటి నివారణకు ఇద్దరూ కలిసి పూజలు చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి. కొంతకాలానికి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ దూరమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హీరో నాగచైతన్యతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో అక్కినేని కుటుంబానికి కోడలు అయింది.

అయితే నాగచైతన్య తో వివాహం జరిగిన తర్వాత కొంతకాలం అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని ఒకరికి ఒకరు దూరమయ్యారు. నాగచైతన్యకి దూరమైన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సమంత ఇటీవల మయాసైటిస్ వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి సోకటంతో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇటీవల విడుదలైన యశోద సినిమా ప్రమోషన్స్ కోసం బయటికి వచ్చింది. ఇదిలా ఉండగా సమంత ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రస్తుతం దక్షిణ కొరియాలో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రీట్మెంట్ కోసం దక్షిణ కొరియా వెళ్లిన సమంత కోసం మాజీ ప్రేమికుడు సిద్ధార్థ కూడా దక్షిణ కొరియా వెళ్లినట్లు సమాచారం. అక్కడ డాక్టర్లను సంప్రదించి సమంత ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో కానీ…ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.