కుర్చీ తాతకి “గుంటూరు కారం” మేకర్స్ పెద్ద మొత్తమే ఇచ్చారట.. 

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు త్రివిక్రమ్ మరియు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ సినిమాపై గట్టి అంచనాలు నెలకొనగా చిత్ర యూనిట్ ఒకో అప్డేట్ ని అయితే ఈ సినిమా నుంచి అందిస్తున్నారు.

అలానే నిన్న సినిమా నుంచి ఫేమస్ మాస్ సాంగ్ కుర్చీ మడత పెట్టి సాంగ్ ని లాంచ్ చేశారు. అయితే దీనిపై చాలానే కామెంట్స్ వినిపించినా అల్టిమేట్ గా సాంగ్ హిట్ అయ్యిపోయింది. అయితే అసలు ఆ డైలాగ్ చెప్పిన కుర్చీ తాత విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఈ సాంగ్ లో ఆ తాత డైలాగ్ వాడుకున్నందుకు గాను సినీ నిర్మాతలు ఆయనకి పెద్ద మొత్తంలోనే డబ్బు చెల్లించి తీసుకున్నారని తెలుస్తుంది. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం జస్ట్ ఆయన బిట్ వాయిస్ వాడుకున్నందుకు ఏకంగా లక్ష రూపాయలు ఆయనకి ఇచ్చి తనకి ఆర్ధికంగా కూడా భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో కుర్చీ తాత మళ్ళీ ఫేమస్ అయ్యాడని చెప్పాలి.

అయితే ఇంకో వెర్షన్ లో ఈ బిట్ కి ఖర్చు చేసింది సంగీత దర్శకుడు థమన్ అని తానే ఆయనకి లక్ష ఇచ్చి ఆ బిట్ ను కొనుగోలు చేసుకున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ జస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇలా మంచి ఆఫర్ అందుకోవడం ఆయనకి ఈ వయసులో ఫేమ్ తో పాటుగా ఆర్ధికంగా అయినా భరోసా అందుతుంది అని కొందరు నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.