నీలో నాకు అది చాలా ఇష్టం.. నందుపై గీతామాధురి కామెంట్స్ వైరల్

సింగర్ గీతా మాధురి, నందు జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కౌంటర్లు ఇవ్వడంలోనూ, నెగెటివ్ కామెంట్లపై సెటైర్లు ఇవ్వడంతో ఈ జంటకు సాటెవ్వరూ లేదు. ఈ మధ్య బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం కారణంగా ఈ ఇద్దరూ వార్తల్లో వైరల్ అవుతున్నారు. తాజాగా ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు యూట్యూబ్ చానెల్ వింత కథనాలు వడ్డించాయి. గీతా మాధురి, నందుల మధ్య చిచ్చు పెట్టిన రష్మీ అంటూ ఓ వార్త వైరల్ అయింది.

Geetha Madhuri Praises Nandu Counter To Netizens
Geetha Madhuri Praises Nandu Counter To Netizens

వాటిపై నందు, గీతా మాధురి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. వీళ్ల కోసం మనం గొడవ పడదామా? అంటూ సెటైర్లు వేశారు. తాజాగా ఇలాంటి ఓ నెగెటివ్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చాడు. నువ్ కనీసం సంపూర్ణేశ్ బాబువి కూడా కాదు అంటూ ఓ నెటిజన్ నందుపై కామెంట్ చేశాడు. కనీసం సంపూ కాదు.. ఆయన తక్కువేమీ కాదు.. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది.. ఆయన వచ్చిన స్టేజ్ నుంచి ఎదిగిన స్థాయి వరకు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని చెప్పాడు.

 

Geetha Madhuri Praises Nandu Counter To Netizens
Geetha Madhuri Praises Nandu Counter To Netizens

ఇలా నందు ఇచ్చిన కౌంటర్‌పై గీతా మాధురి స్పందించాడు. అలా నెటిజన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇవ్వడంతో భర్తపై ప్రేమను కురిపించింది. కొందరికి నువ్ తిరిగి కౌంటర్ ఇస్తావ్ చూడు.. ఆ విధంగా నువ్ ఇవ్వడం నాకు ఎంతో ఇష్టం అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి ఇలా నందు మాత్రం తన స్పోర్టివ్ నెస్, డౌన్ టు ఎర్త్ నేచర్‌ను అందరికీ పరిచయం చేస్తున్నాడు. నందు ప్రస్తుతం తన ఆశలన్నీ బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంపైనే పెట్టుకుంది.