సినీ చరిత్రలోనే మొదటిసారిగా అద్భుతమైన రికార్డు సృష్టించిన మేజర్?

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా అడివి శేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇకపోతే ఈ సినిమా జూన్ 3వ తేదీన విడుదల కావడంతో ఇప్పటి వరకు సినీ చరిత్రలోనే ఏ సినిమా విడుదల కాని విధంగా ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే కేవలం అభిమానుల కోసం ముందే ప్రీ రిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.

అభిమానుల కోసం దేశ వ్యాప్తంగా 9 నగరాలలో ఈ సినిమాని ప్రదర్శించనున్నారు.ఈ స్పెషల్ స్క్రీనింగ్ చూడాలంటే బుక్ మై షో యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని నగరాలలో ఇప్పటికే టికెట్స్ అన్ని క్లోజ్ అయ్యాయని చిత్రబృందం వెల్లడించారు. ఈ విధంగా ఈ సినిమా విడుదల కాకుండానే అభిమానుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మేజర్ సినిమా పాన్ ఇండియా చిత్రం కావడంతో చిత్ర యూనిట్ అహ్మదాబాద్ ఇంకా అలాగే జైపూర్ లో వంటి వివిధ నగరాలలో పెద్దయెత్తున ప్రమోషన్ చేస్తున్నారు. అడవి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్ శోభిత హీరోయిన్ల శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఇంకా అలాగే ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జూన్ 3 వ తేదీ విడుదల కానుంది.