అఖిల్ 6 కి ఇద్దరు డైరెక్టర్స్ ..మరిది కోసం సాలీడ్ ప్రాజెక్ట్ సెట్ చేసిన సమంత ..?

అఖిల్ 4 గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. సమంత గెస్ట్ రోల్ లో కనిపించబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. బడ్జెట్ కి వెనకాడకుండా బెస్ట్ అవుట్ పుట్ కోసం కొన్ని సీన్స్ ని మళ్ళీ రీ షూట్ కూడా చేస్తున్నట్టు సమాచారం.

ఇక అక్కినేని కాంపౌండ్ లో నిర్మించే సినిమాలకి నాగార్జున ఇచ్చే జడ్జ్‌మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాంటి జడ్జ్‌మెంట్ నాగార్జున.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కి ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రష్ చూసిన నాగార్జున సూపర్ హిట్ అన్న మాట చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తో కలిసి సురేందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. దాదాపు 35 కోట్లు బడ్జెట్ ని కేటాయించినట్టు సమాచారం.

అయితే అఖిల్ సినిమా రిలీజ్ కాకముందే మరొక సినిమా కన్‌ఫర్మ్ అవుతుండటం గొప్ప విషయం. ఇప్పుడు కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ కాకుండానే అఖిల్ 5 ప్రకటించారు. ఈ సినిమా సెట్స్ మీదకి రాకుండానే అఖిల్ 6 కోసం స్వయంగా సమంత రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సమంత నటించిన ది ఫ్యామిలీ మాన్ డైరెక్టర్స్ రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే లతో మరిది కోసం సమంత సినిమా సెట్ చేస్తుందట. ఇప్పటికే వైజయంతి మూవీస్ లో అఖిల్ సినిమా చేసేందుకు డేట్స్ ఉన్నాయట. రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే దర్శకులుగా అఖిల్ 6 ని సి అశ్వనీ దత్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. చూడాలి మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో.