Ram Charan: రామ్ చరణ్ సంస్కారానికి ఫ్యాన్స్ ఫిదా…ఏం చేశాడంటే ?

Ram Charan: ఆర్ఆర్‌ఆర్‌ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాల్లో వేసుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. మూవీ రిలీజ్ అయ్యి వారం రోజులు గడుస్తున్నా ఈ సినిమాకున్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. రిలీజ్‌కు ముందు చిత్ర బృందం పలు ప్రదేశాల్లో తిరిగి, చేసిన ప్రమోషన్స్ బాగానే ఫలించినట్టు తెలుస్తోంది . ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ అవెయిటెడ్‌ చిత్రంగా ప్రసిద్ధికెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది.

మొన్నటివరకూ సాదా సీదా ప్రేక్షకులతో కనిపించిన ధియేటర్లు ప్రస్తుతం హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే ఇప్పటికే ఆయన చేసిన కొద్దిపాటి సినిమాలతోనే ఎంతో ఇమేజ్‌ను సొంత చేసుకున్న చెర్రీ, ఇప్పుడు దాని కన్నా రెట్టింపు స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో చేసిన అద్భుత నటనకు గానూ ఆయనకు అభిమానులు 100 మార్కులు ఇవ్వడం తప్పనిసరి అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ సినిమా చూసిన మరికొందరు సెలబ్రెటీలు , నిర్మాతలు, దర్శకులు కూడా వినూత్న రీతిలో ఈ మెగా వారసున్ని పైకెత్తుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సంస్కారం పై మెహర్ రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారిని బాస్ ఈజ్ బ్యాక్’ అని తీసుకురావాలని వి.వి.వినాయక్ గారికి అప్పగించి ఎంత పెద్ద హిట్ చేసారో అందరికి తెలిసిన విషయమే. అలా సినిమా హిట్టయిన దాదాపు పది నెలల తర్వాత, వివి వినాయక్ గారిని భోజనానికి ఇంటికి పిలిచారు. చరణ్‌కు తెలుగులో రాయడం సరిగా రాదు, కానీ తెలుగులో వివి వినాయక్‌కు తెలుగులో లెటర్ రాసి, నాన్నని ఇలా ప్రజెంట్ చేసి ఆయన్ని సర్‌ప్రైజ్ చేశారు. సినిమాను సూపర్ హిట్ చేసినందుకు గానూ వినాయక్ గారికి దండేసి, శాలువా కప్పి, ఆయన కాళ్లకు నమస్కారం కూడా చేసారంటే చరణ్ బాబు సంస్కారం ఎంత గొప్పదో అంటూ మెహర్ రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. దీంతో మరోసారి మెగా పవర్ స్టార్‌ను ఈ విధంగా చూసిన మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ను ట్యాగ్‌ చేస్తూ హల్‌ చల్‌ చేస్తున్నారు .