జలపాత సుందర దృశ్యాల మధ్య సాగిన పిక్నిక్ విషాదంగా ముగిసింది. నటుడు రోహిత్ బాస్ఫోర్ మృతితో సినీ వర్గాలు, కుటుంబ సభ్యులు తీవ్ర షాక్కు గురయ్యారు. ఆయన గర్భంగా వాటర్ ఫాల్స్ వద్ద జారిపడి మృతి చెందాడన్న సమాచారం అధికారికంగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు మాత్రం వివిధ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పిక్నిక్కు వెళ్లిన రోహిత్ మృతదేహంగా మారడం వింతగా ఉందని కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా అతడి ఫోన్ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆఫ్లో ఉండడం, ఈత రాని వ్యక్తిని నీటి ప్రాంతానికి తీసుకెళ్లడం పట్ల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించాలని వారు పోలీసులను కోరుతున్నారు. పోలీసులు మాత్రం ఇదంతా ప్రమాదవశాత్తే జరిగిందని చెబుతున్నారు. .
సమాచారం అందిన వెంటనే స్పందించి, సుమారు రెండు గంటల శోధన అనంతరం రోహిత్ మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ వెలికితీశారని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రాథమికంగా ఎలాంటి కుట్ర లేదా అనుమానాస్పద కోణం కనిపించలేదని వారు వెల్లడించారు.
‘ఫ్యామిలీ మ్యాన్ 3’లో నటిస్తున్న రోహిత్కు ఇది కీలక అవకాశంగా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో అతడి మృతి ఆవేదనకరమే. అభిమానులు, సహచర నటులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరి అతని మరణంపై ఉన్న మిస్టరీ మరింత బిగుసుకుపోతుందా లేదా సహజ మరణంగా తేలుతుందా అన్నది విచారణలో తేలనుంది.