ఒక్కసారిగా “గుంటూరు కారం” పై మొత్తం మారిపోయింది..!

జస్ట్ మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా మూడో చిత్ర “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, హీరోయిన్ శ్రీలీల మహేష్ సరసన నటిస్తున్నారు.

ఈ సినిమాపై ఇది వరకు ఓకే పర్వాలేదు అనే రేంజ్ లో అనిపించాయి పైగా పాటలు కూడా మరీ అంత పెద్ద హిట్ కాలేదు కానీ ఒక్కసారి ట్రైలర్ కట్ బయటకి వచ్చిన తర్వాత మొత్తం మార్చేశారు. అప్పటువరకు ఏదో అరకొర అంచనాలు మాత్రమే ఈ సినిమా మీద ఉంటే ఇప్పుడు మాత్రం అంతా వేరేలా ఉంది.

కొందరు ఈ సినిమా వల్ల ఇతర సినిమాలకి పెద్ద నష్టం ఏమి ఉండదు అనుకున్నారు కానీ ట్రైలర్ వచ్చాక ఇపుడు సినిమాపై బజ్ ని చూస్తుంటే ఇవన్నీ వెనక్కి తీసుకోవాలి అని చెప్పక తప్పదు. కాగా ఈ సినిమాకి బుకింగ్స్ కూడా జస్ట్ కొన్ని కొన్ని చోట్ల స్టార్ట్ కాగా ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి.

మొత్తానికి మాత్రం “గుంటూరు కారం” కి ఒక్క ట్రైలర్ తో అంతా మారిపోయింది అని చెప్పాలి. సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం వసూళ్లు చాలా ఎక్కువే వస్తాయి. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు రమ్య కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ జనవరి 12న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.