ఓటీటీ లోకి రాబోతున్న ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ!

మణికందన్‌, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్‌ మూవీ ట్రూ లవర్‌..ఈ చిత్రానికి ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించాడు. తమిళంలో ‘లవర్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీని తెలుగులో ‘ట్రూ లవర్‌’గా డైరెక్టర్‌ మారుతి మరియు ‘బేబీ’ ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌ కలిసి రిలీజ్‌ చేశారు.

యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రభురామ్‌ వ్యాస్‌ ఈ మూవీని తెరకెక్కించాడు. కాలేజీ రోజుల నుంచి అరుణ్‌ (మణికందన్‌), దివ్య (శ్రీగౌరిప్రియ) ప్రేమించుకుంటారు. ప్రతి విషయంలో దివ్యను అనుమానిస్తుంటాడు అరుణ్‌. ఆమె మరొకరితో క్లోజ్‌గా మాట్లాడినా అస్సలు సహించలేడు. అరుణ్‌ ప్రవర్తనకు విసిగిపోయిన దివ్య అతడికి బ్రేకప్‌ చెప్పాలని ఎన్నో సార్లు అనుకుంటుంది.

దివ్య తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిన ఓ టూర్‌కు ఆమె వెంట అరుణ్‌ కూడా వెళతాడు..అక్కడ ఏం జరిగింది..అరుణ్‌లో మార్పు వచ్చిందా..దివ్య ప్రేమను అర్థం చేసుకున్నాడా.. అన్నదే ఈ మూవీ కథ. అపనమ్మకం మరియు అభద్రతా భావంతో కూడిన ఏ ప్రేమ నిలబడదనే పాయింట్‌తో దర్శకుడు ప్రభురామ్‌ వ్యాస్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ట్రైలర్‌ మరియు టీజర్స్‌తో ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించింది. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. తమిళంలో మాత్రం డీసెంట్‌ కలెక్షన్స్‌ రాబడుతోంది. తమిళంలో ‘లవర్‌’ మూవీ రజనీకాంత్‌ ‘లాల్‌ సలామ్‌’ కలెక్షన్స్‌ను బీట్‌ చేసింది.

ఆరు రోజుల్లో ఈ మూవీ పది కోట్ల వరకు గ్రాస్‌, నాలుగున్నర కోట్ల షేర్‌ను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం.. ‘ట్రూ లవర్‌’లో నటించిన శ్రీ గౌరిప్రియ తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఈ భామ వైజయంతీ మూవీస్‌లో వచ్చిన ‘మెయిల్‌ ‘మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది . ఇటీవలే ఈ భామ ‘మ్యాడ్‌’ మూవీ తో తెలుగులో పెద్ద హిట్‌ అందుకున్నది. ఇదిలా ఉంటే ‘ట్రూ లవర్‌’ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా తమిళం మరియు తెలుగు స్ట్రీమింగ్‌ రైట్స్‌ను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ దక్కించుకున్నట్లు సమాచారం. ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ గా రూపొందిన ‘ట్రూ లవర్‌’ మూవీ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు సమాచారం.. మార్చి ఫస్ట్‌ వీక్‌లో ఓటీటీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు తెలుస్తుంది.