జాను సినిమా షూటింగ్ సమయంలో విమానం నుంచి కిందకు దుకాను.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్!

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రస్తుతం రెండవ సీజన్ ఎంతో విజయవంతంగా ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మూడవ ఎపిసోడ్లో భాగంగా యంగ్ హీరోలు అయినటువంటి శర్వానంద్, అడవి శేషుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా శర్వానంద్ తన సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రమాదం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ తాను జాను సినిమా షూటింగ్ సమయంలో విమానం నుంచి కిందకు దూకేశానని ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిందంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు. జాను సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటలో భాగంగా తాను 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విమానం నుంచి కిందకు దూకి స్కై డైవింగ్ చేయాల్సి ఉంది. ఇలా చేయడానికి కావలసిన శిక్షణ కూడా తాను తీసుకున్నానని తెలిపారు.అయితే 15000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విమానం నుంచి తాను కిందకు దూకగానే పారాచూట్ తెరుచుకోలేదని తెలిపారు.

ఈ విధంగా పారాషూట్ తెరచుకోకపోవడంతో తాను కింద పడిపోయానని ఆ ప్రమాదంలో తనకు తీవ్రమైన గాయాలు తగిలాయని వెల్లడించారు.తలకు కాళ్లు చేతులకు పెద్ద ఎత్తున గాయాలు కావడంతో ఈ ప్రమాదం నుంచి తాను కోలుకోవడానికి సుమారు రెండు సంవత్సరాలకు పైగా సమయం పట్టింది అంటూ ఈ సందర్భంగా శర్వానంద్ బాలకృష్ణ టాక్ షోలో తనకు జరిగిన ప్రమాదం గురించి తెలియజేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.