ఛాయాదేవి ఎలాంటి దీనస్థితిలో చనిపోయారో తెలుసా?

ఛాయాదేవి గారు ఒకప్పటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి అందరి హీరోల సినిమాలలో నటించారు. ఛాయాదేవి గారు ఎక్కువగా హీరో లేదా హీరోయిన్ కి అత్తగా వారిని హింసించే పాత్రలలో ఎక్కువగా నటించేవారు. అత్యాశకు పోయి గొడవలు పడడం లాంటి క్యారెక్టర్ లో ఈవిడ జీవించేస్తుంది.

సినిమాలలో సూర్యకాంతం తరువాత ఆ పాత్రలకు న్యాయం చేసే మంచి నటన కలిగిన వ్యక్తి ఛాయాదేవి. సినిమాలలో గయాలితనం, అత్యాశ, ఓర్వలేకపోవడం లాంటి పాత్రలు ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కానీ నిజజీవితంలో ఆమె అందరితో బాగా మాట్లాడడం, సహాయం చేయడం లాంటివి చేసేవారు. సినీ జీవితానికి నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉండేది. ఆమెను చూసిన వారంతా ఈమె ఇంత మంచివారా అని అనుకునేవారు.

ఆమె సంపాదించిన డబ్బుతో మద్రాసులో ఒక ఇల్లు కొనుక్కున్నారు. సినీ నిర్మాతలకు ఫైనాన్స్ రూపంలో డబ్బు ఇచ్చేవారు. ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం, వారికి భోజనం పెట్టడం, వారికి ఏదైనా సహాయం కావాలంటే చేయడం ఆమె అలవాటు. ఆమె మంచితనాన్ని గ్రహించిన నిర్మాతలు ఆమె వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బు ఫైనాన్స్ గా తీసుకున్నారు. కొంతకాలం తర్వాత ఆమె షుగర్ బారిన పడడం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల డాక్టర్లు ఖాళీ బొటన వేలు తీసేయాలని చెప్పి బొటన వేలును తొలగించారు.

అయినా షుగర్ పెరిగి చివరకు మొత్తం కాలు తీసేయాల్సి వచ్చింది. తర్వాత ఆమె మంచాన పడింది. డబ్బు తీసుకున్న నిర్మాతలు మొండి చేయి చూపించడం, అదే సమయంలో ఈ ఇల్లు నాదే అంటూ ఎవరో వచ్చి కోర్టులో కేసు వేయడం ఆమెను మరింత అనారోగ్యం పాలు చేసి చివరకు ఆమె మరణించడం జరిగింది. చూశారుగా తన మంచి తనమే శాపంగా మారి ఆమె ఇలా చనిపోవడం జరిగింది.