సెలబ్రిటీలు ఎవరు చనిపోయిన నాగార్జున వెళ్లకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా?

nagarjuna-at-63-sets-superstar-goals-from-shiva-to-forthcoming-brahmastra-telugu-actors-wide-range-of-work

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించి పలుకారణాలవల్ల సెలబ్రిటీలు మరణిస్తే పెద్ద ఎత్త సినీ సెలబ్రిటీలు తరలి వెళ్లి చనిపోయిన వ్యక్తులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు మరణించిన సమయంలో నటీనటులు దర్శక నిర్మాతలు సైతం హాజరవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో కృష్ణంరాజు కృష్ణ వంటి ప్రముఖ హీరోలు మరణించిన సమయంలో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా వీరి చివరి చూపు కోసం తరలివచ్చారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున మాత్రం అటెండ్ కావడం లేదు.ఈ విధంగా నాగార్జున చనిపోయిన సెలబ్రిటీలను చూడటానికి ఎందుకు రాలేదు ఆయన రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయి. మరి నాగార్జున తండ్రి నాగేశ్వరరావు తల్లి అన్నపూర్ణ దేవి మరణించిన సమయంలో కూడా సీని సెలెబ్రిటీలందరూ తరలివచ్చారు.ఈయన మాత్రం దాసరి గారు మరణించిన సమయంలో అది కూడా మూడవరోజు వెళ్లి తన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇక ఇండస్ట్రీలో ఎవరు చనిపోయిన నాగార్జున మాత్రం ఆ కార్యక్రమాలకు హాజరు కారు. ఈయన రాకపోగా ఈయన స్థానంలో అఖిల్ నాగచైతన్య వెళ్లి సినీ సెలబ్రిటీలకు నివాళులు అర్పిస్తూ ఉంటారు.అయితే నాగార్జున ఇలా చనిపోయిన వారిని సందర్శించడానికి ఎందుకు వెళ్ళరు అనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. బహుశా అలాంటి చోటకు వెళితే ఆయనకు తన తల్లిదండ్రులు గుర్తుకు వస్తారా లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయో తెలియదు కానీ నాగార్జున మాత్రం ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారని చెప్పాలి.