Samantha: నా మౌనాన్ని బలహీనతగా భావించద్దు… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సమంత..!

Samantha: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో ఉంది. “ఏ మాయ చేసావే” సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. సమంత తెలుగు, తమిళ,హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

సమంత అక్కినేని నాగ చైతన్య ని వివాహం చేసుకొని కొంత కాలం తర్వాత అతని నుండి విడిపోయి విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా దుమారం రేపింది. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొంత కాలం డిప్రెషన్ లో ఉన్నా, తర్వాత తన కెరీర్ మీద దృష్టి పెట్టీ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత తరుచు కొందరికి గట్టి వార్నింగ్ ఇచ్చింది.

సోషల్ మీడియా అన్న తర్వాత ట్రోలింగ్ చేసేవారు ఉంటారు. ఇక సమంత విషయానికి వస్తే ఆమె చేసే పోస్టులకు అప్పుడప్పుడు అతిగా ట్రోల్ చేస్తుంటారు. దీంతో సమంత ఇటీవల తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన మౌనాన్ని బలహీనంగా భావించవద్దు…మౌనంగా ఉన్నాం అంటే అన్నీ ఒప్పుకున్నట్లు కాదు.. జాలి దయ అనే వాటికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఒక సినిమా వేడుకల్లో పాల్గొన్న సమంత మునుపెన్నడూ లేని విధంగా ఒక గ్లామరస్ డ్రెస్ లో కనిపించింది. దీంతో కొంత మంది ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. ఇలా ట్రోలింగ్ చేసే వారిని ఉద్దేశించి సమంత సీరియస్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.