టాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తన కలల ప్రాజెక్ట్ గురించి చెబుతూ వచ్చిన జక్కన్న, తాజాగా ముగ్గురు స్టార్ హీరోలను మహాభారతం కోసం ఫిక్స్ చేసినట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ లిస్ట్లో ఎన్టీఆర్, ప్రభాస్, నాని ఉన్నట్టు స్పష్టమైంది.
శ్రీకృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ని ఎంచుకోవాలని రాజమౌళి చాలాకాలంగా చెబుతూ వచ్చారు. ఎన్టీఆర్ గొంతు ధ్వని, నటనా ప్రతిభ, హావభావాలు శ్రీకృష్ణుడి పాత్రకు అద్భుతంగా సరిపోతాయని ఆయన అభిప్రాయం. ఇక కర్ణుడి పాత్రకు ప్రభాస్ని భావిస్తున్నట్టు రాజమౌళి గతంలో వెల్లడించారు. కర్ణుడి గంభీరత, దిగువ అభిమానం వంటి మూడ్లను ప్రభాస్ బాగా చూపించగలడని చెప్పుకున్నారు.
తాజాగా ‘హిట్ 3’ ప్రమోషన్స్లో నాని గురించి కూడా రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో నాని పాత్ర ఖచ్చితంగా ఉంటుందని వెల్లడించడంతో ఆయన పాత్రపై భారీ క్యూరియాసిటీ నెలకొంది. నానికి ఏ పాత్ర ఇవ్వనున్నారో అనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో చర్చకు దారి తీసింది.
ఈ ముగ్గురు హీరోలు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్లో భాగం అయితే, తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచే అవకాశం ఉంది. మహేష్ బాబుతో ‘ఎస్ఎస్ఎంబీ29’ను పూర్తి చేసిన తరువాత మహాభారతం పనులు మొదలు పెట్టేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ నుంచి టాక్ వస్తోంది.