బెంజ్‌ సినిమా నిర్మాతగా లోకేశ్‌ కనగరాజ్‌!

యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ సొంత నిర్మాణ సంస్థ ’జి స్క్వేర్‌’ బ్యానరుపై రాఘవ లారెన్స్‌ హీరోగా నిర్మిస్తున్న చిత్రం ’బెంజ్‌’. ఇందులో సీనియర్‌ నటులు ఎస్‌జే సూర్య, ఫహద్‌ ఫాజిల్‌ ఆన్‌బోర్డులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.’రెమో’, ’సుల్తాన్‌’ వంటి హిట్‌ చిత్రాలను రూపొందించిన భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ కథ డిమాండ్‌ మేరకు ఈ ఇద్దరు అగ్రనటులను తీసుకున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.కాగా, ’మా నగరం’, ’ఖైదీ’, ’మాస్టర్‌’, ’విక్రమ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాలను రూపొందించిన యంగ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ . జి స్క్వేర్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి చిత్రంగా గత సంవత్సరం సినిమాను తెరకెక్కించారు.అలా నిర్మాతగా మారిన లోకేష్‌.. ఇప్పుడు తన బ్యానర్‌పై రెండో చిత్రంగా ’బెంజ్‌’చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తన దర్శకత్వంలో రూపొందుతున్న ’కూలీ’ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలోకి రానుంది.