డైరెక్టర్‌అట్లీ మోసం చేశారు!?

ఒకానొక సమయంలో స్టార్‌ హీరోయిన్‌ గా రాణించింది ప్రియమణి. ‘పెళ్ళైన కొత్తలో’ సినిమా తో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయింది. తెలుగులో దాదాపు కుర్రహీరోలందరి సరసన నటించింది. అలాగే స్టార్‌ హీరోలతో కూడా జతకట్టింది నాగార్జున తో కలిసి రగడ, వెంకటేష్‌ తో కలిసి నారప్ప లో నటించి మెప్పించింది.

ఇక తమిళ్‌ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ప్రియమణి. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా జవాన్‌ లో కీలక పాత్రలో నటించింది ప్రియమణి. గతంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన చైన్నై ఎక్స్‌ ప్రెస్‌ లో స్పెషల్‌ సాంగ్‌ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఇప్పుడు జవాన్‌ లో కనిపించింది.

ఇదిలా ఉంటే దర్శకుడు అట్లీ తనను మోసం చేశాడని తెలిపారు ప్రియమణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి మాట్లాడుతూ.. దర్శకుడు అట్లీ వీడియో కాల్‌ లో మాట్లాడుతూ.. జవాన్‌ లో నటించమని అడిగారు. అయితే నేను స్పెషల్‌ సాంగ్‌ అని అనుకున్నా కానీ ఆతర్వాత కీ రోల్‌ అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో దళపతి విజయ్‌ అతిథి పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది నిజమేనా అని అడిగాను.