దిల్ రాజు ఇంట్లో గ్రాండ్ సెలబ్రేషన్స్

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి దిల్ రాజు. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లో అందుకున్నారు. ఆయన బ్యానర్ లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కావడం విశేషం.

ప్రస్తుతం లో బడ్జెట్ సినిమాల కోసం మరో ప్రొడక్షన్ హౌస్ ని దిల్ రాజు స్టార్ట్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా మొదటి ప్రయత్నంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ ఈ చిత్రం రెడీ అవుతూ ఉండటం విశేషం.

వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దిల్ రాజు తన మొదటి భార్య చనిపోయిన తర్వాత కుమార్తె ప్రోద్బలంతో రెండో వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం దిల్ రాజు పెళ్లి జరిగింది. ఇక దిల్ రాజు రెండో భార్య ద్వారా మరోసారి తండ్రి అయ్యారు. ఏడాది క్రితం కొడుకు పుట్టాడు.

కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలను దిల్ రాజు గ్రాండ్ గా ప్లాన్ చేయడం విశేషం. గురువారం సాయంత్రం జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ వేడుకలు నిర్వహించబోతున్నారు. దీనికోసం టాలీవుడ్ సినీ ప్రముఖులు అందరిని దిల్ రాజు ఆహ్వానించారు. అలాగే రాజకీయ ప్రముఖులను కూడా ఇన్వైట్ చేశారు.

చాలాకాలం తర్వాత దిల్ రాజు కుటుంబంలో జరిగే వేడుక కావడంతో సినీ రాజకీయ ప్రముఖులు అందరితో తన కుమారుడికి బ్లెస్సింగ్స్ ఇప్పించాలని దిల్ రాజు గట్టిగానే ప్లాన్ చేశారు. మరి ఈ వేడుకకి టాలీవుడ్ నుంచి ఏ స్థాయిలో సినీ ప్రముఖులు హాజరు అవుతారు అనేది వేచి చూడాలి. దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో మంచి సత్సంబందాలు ఉండడంతో అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.