శాకుంతలం సినిమా కోసం ముందుగా సమంతని కాకుండా ఆ హీరోయిన్ ని సంప్రదించారా?

గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.ఇక ఈ కార్యక్రమానికి సమంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి గుణశేఖర్ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇక ఈ సినిమా మొదలవ్వడానికి తన కుమార్తె నీలిమ కారణమని తెలిపారు.ఆమె విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిర్మాతగా మారాలనుకుంటున్నానని ఒక అద్భుతమైన కథ తయారు చేయమని చెప్పడంతోనే ఈ శాకుంతలం సినిమా తెరపైకి వచ్చిందని గుణశేఖర్ వెల్లడించారు.

ఇక గుణశేఖర్ ఈ సినిమా కథ రాస్తున్నప్పుడు ఆయన ఈ సినిమాలో నయనతార అయితే బాగుంటుందని ఆలోచించారట.ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని తన కుమార్తె దగ్గర ప్రస్తావించగా తన కుమార్తె మాత్రం ఈ సినిమాలో నయనతార కన్నా సమంత అయితే అద్భుతంగా సరిపోతుందని చెప్పారట. ఇలా తన కుమార్తె సమంత పేరు చెప్పగానే ఆమె చాలా మోడ్రన్ లుక్ లో ఉంటుందని ఆలోచించాను. అయితే ఆమె నటించిన రంగస్థలం సినిమాలో రామలక్ష్మీ పాత్ర గుర్తుకు వచ్చి తాను ఈ పాత్రకు అద్భుతంగా సరిపోతుందని భావించే కథ సిద్ధం చేశానని గుణశేఖర్ తెలిపారు.ఈ కథ తాను సమంతకు వివరిస్తున్న సమయంలో తనలో నాకు సమంత కాకుండా శకుంతల కనిపించిందని ఈయన తెలియజేశారు.