ముగ్గురు భామల ‘క్రూ’ !?

బాలీవుడ్‌ భామలు టబు, కరీనా కపూర్‌ ఖాన్‌, నేషనల్‌ అవార్డు విన్నర్‌ కృతిసనన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ’క్రూ’. ‘లూట్‌కేస్‌’ ఫేమ్‌ రాజేష్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఏక్తాకపూర్‌, రియాకపూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ ముగ్గురు ఎయిర్‌ హోస్టెస్‌ గెటప్‌లో కనిపిస్తున్నారు. టబుతో ప్రమాదం అని, కరీనాను దొంగ అని, కృతి సనన్‌ను నకిలీ అని పోస్టర్స్‌కు క్యాప్షన్‌ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న ముగ్గురు మహిళల జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇక ఈ చిత్రంలో పంజాబీ యాక్టర్‌ దిల్జీజ్‌ దోసాంజ్‌, కపిల్‌ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.