జర్నలిస్టుకి ‘కలర్స్‌’ స్వాతి షాక్ ఇచ్చింది..!

పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి స్వాతి రెడ్డి తెలుగు బుల్లితెరపై చేసిన టాక్‌ షో ‘కలర్స్‌’ పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్‌ గా అవకాశాలు కూడా అందుకుని వెండితెరపైనా సత్తా చాటారు. తర్వాత పెళ్లి చేసుకుని విదేశాలకి వెళ్లిపోయిన ఆమె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ‘కలర్స్‌’ స్వాతి వివాహం 2018లో వికాస్‌ వాసు అనే కేరళకు చెందిన పైలట్‌ తో జరిగింది. వివాహమై విదేశాలకి వెళ్ళాక%ౌౌ% రెండు మూడుసార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చిన ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారని, అందువల్ల మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ ఏడాది ‘మంత్‌ ఆఫ్‌ మధు’ అనే సినిమా విడుదల కానుంది. ‘మంత్‌ ఆఫ్‌ మధు’ సినిమాలో నవీన్‌ చంద్రకు జోడీగా ఆమె నటించారు. ఈ రోజు సినిమా ట్రైలర్‌ ను సాయి ధరమ్‌ తేజ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌ నిర్వహించిన క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ కార్యక్రమంలో విడాకులకు సంబంధించిన ప్రశ్న స్వాతికి ఎదురైంది.

అయితే ఆమె తెలివిగా ’’ఈ కార్యక్రమానికి, ఆ ప్రశ్నకు సంబంధం లేదు, అది అనవసరం అని నా అభిప్రాయం అందుకే నేను సమాధానం చెప్పను’’ అని స్వాతి స్పందించారు. నవీన్‌ చంద్ర హీరోగా ‘మంత్‌ ఆఫ్‌ మధు’ సినిమాను శ్రీకాంత్‌ నాగోటి దర్శకత్వంలో క్రిష్వి ప్రొడక్షన్స్‌, హ్యండ్‌ పిక్డ్‌ స్టోరీస్‌ బ్యానర్స్‌పై యశ్వంత్‌ ములుకుట్ల ఈ నిర్మిస్తున్నారు.

ఒక విషయాన్ని జనం ఏ కోణంలో చూస్తున్నారనే దానిపైనే ‘మంత్‌ ఆఫ్‌ మధు’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ ను చూస్తే అర్థమవుతుంది. కలర్స్‌ స్వాతి గృహిణి పాత్రలో నటించగా విపరీతమైన భావోద్వేగాలున్న తాగుబోతు భర్త పాత్రలో నవీన్‌ చంద్ర కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రేయా నవేలీ, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించగా అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు.