ఓటిటిలో “వారిసు” పాన్ ఇండియా రిలీజ్ పై క్లారిటీ.!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన పలు మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అయితే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చి భారీ పోటీ అజిత్ మరియు విజయ్ ల సినిమాలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. మరి ఇంత భారీ పోటీలో వచ్చిన ఈ చిత్రాల్లో ఆల్రెడీ అజిత్ సినిమా తూనీవు ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసిన సంగతి తెలిసిందే.

ఇక నెక్స్ట్ అయితే విజయ్ వారిసు సినిమా ఇప్పుడు డిజిటల్ గా రిలీజ్ అయ్యింది. కాగా ఈ సినిమా హక్కులు కూడా పాపులర్ ఓటిటి సంస్థ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఈ సినిమా నేటి నుంచి అందులో ముందుగా ఒరిజినల్ తమిళ్ లాంగ్వేజ్ సహా తెలుగు మరియు కన్నడ మలయాళ భాషల్లో అయితే వచ్చేసింది.

ఇక థియేట్రికల్ గా ఈ సినిమా తెలుగు తమిళ్ తో పాటుగా హిందీలో కూడా వచ్చింది. మరి మేకర్స్ ఈరోజు హిందీలో ఈ సినిమాని అందులో తీసుకొని రాలేదు. దీనితో హిందీ హక్కులు వేరే వారికీ ఉన్నాయా అని డౌట్ వచ్చి క్లియర్ అయ్యే లోపే మేకర్స్ దీనిపై అధికారిక క్లారిటీ అయితే అందించారు.

ఈ సినిమా హిందీ హక్కులు కూడా ప్రైమ్ వీడియో వారి దగ్గరే ఉండగా ఇందులో ఈ సినిమా ఈ మార్చ్ 8 నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని తాజాగా తెలిపారు. దీనితో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ డిజిటల్ రిలీజ్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.