స్టైలీష్ స్టార్ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఫ్యామిలీని తీసుకుని కుంటాల జలపాతాన్ని సందర్శించాడు. అక్కడి వరకు బాగానే ఉంది. అల్లు అర్జున్ వచ్చాడని తెలియడంలో పక్కనున్న గ్రామాల్లోని యూత్ అంతా వచ్చారు. సెల్ఫీలతో బన్నీని ఉక్కిరిబిక్కిరి చేశారు. అది కూడా బాగానే ఉంది. అయితే బన్నీపై ప్రస్తుతం కేసులు నమోదు అవుతున్నాయి. కోవిడ్ నిబంధనలను అతిక్రమించాడని కేసు ఫైల్ చేస్తున్నారు.
సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు అల్లు అర్జున్ ఫై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ లకు పిర్యాదు చేశారు . కోవిడ్ రూల్స్ అతిక్రమించారని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు పిర్యాదులో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం అల్లు అర్జున్ ఫ్యామిలీ. అలాగే పుష్ప టీం కుంటాల జలపాతం సందర్శన చేసారని , తిప్పేశ్వర్లో అనుమతి లేకుండా చిత్రీకరణ కూడా జరిపారని వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు.
పుష్ప చిత్రం కోసం కేరళ అడువుల్లో షూటింగ్ జరపాలని ప్రయత్నించిన యూనిట్ను కరోనా దెబ్బ కొట్టింది. కరోనా విజృంభించడంతో అన్ని షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ప్రస్తుతం వేరే దేశాలు, రాష్ట్రాల్లో షూటింగ్ జరపడం కూడా అంత సులువేమీ కాదు. అందుకే మన రాష్ట్రంలోనే లొకేషన్స్ వెతుకుతున్నారు. ఆ క్రమంలోనే కుంటాలను సందర్శించారట. అందుకే బన్నీ చుట్టూ ఈ కేసులు వచ్చి పడ్డాయ.