పూజా హెగ్డేకు క‌రోనా ఫీవ‌ర్.. ముంబై చెక్కేసిన బుట్ట‌బొమ్మ‌

ముకుంద సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన మంగుళూరు సోయగం పూజా హెగ్డే ప్ర‌స్తుతం తెలుగు, హిందీ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అరవింద సమేత వీరరాఘవ’తో మంచి హిట్ కొట్టిన పూజా ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్‌’, అఖిల్‌తో కలిసి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్‌లో కూడా రెండు ప్రాజెక్ట్‌లను ఓకే చేసింది.

కొద్ది రోజుల క్రితం ఇటలీలో రాధేశ్యామ్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని వ‌చ్చిన పూజా హెగ్డే ప్ర‌స్తుతం అఖిల్ న‌టిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ షూటింగ్ స‌మ‌యంలో జ‌లుబు, ద‌గ్గుతో బాధ‌ప‌డుతూ అనారోగ్యానికి గురైంద‌ట పూజా హెగ్డే. ఎందుకైన మంచిద‌ని ఈ అమ్మ‌డికి కరోనా ప‌రీక్ష‌లు చేయిస్తే నెగెటివ్ అని తేలింది. అయిన‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త‌గా ముంబైలోని త‌న ఇంటికి వెళ్లి కొద్ది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల‌ని డిసైడ్ అయింది పూజా.

వారం రోజుల త‌ర్వాత మ‌రో సారి టెస్ట్ చేయించుకొని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ షూటింగ్ సెట్లో అడుగుపెట్ట‌నుంది పూజా. క్లైమాక్స్ స‌న్నివేశాలు బ్యాలెన్స్ ఉండ‌గా, వీటిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి సంక్రాంతికి మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ షూటింగ్ పూర్తైన వెంట‌నే పూజా హెగ్డే హిందీ సినిమా షూటింగ్స్ పాల్గొన‌నుంది