RRR: ఇద్దరూ సమానమే..ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చిన తారక్..?

RRR: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్ లను రాబట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ రాజమౌళి మాత్రం ఒక విషయంలో అసహనం చెందుతున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కే ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించిందని,రాజమౌళి కావాలనే ఎన్టీఆర్ పాత్ర తగ్గించారని అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇదే విషయంపై గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇంటర్వెల్ సీన్ తర్వాత రామ్ చరణ్ పాత్ర చాలా హైలెట్ అయ్యింది అన్న వార్తలు కూడా బలంగా వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇదే విషయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో దర్శకుడు రాజమౌళి ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాను తెరకెక్కించారని, తన పాత్రకు సంబంధించి తనకు ఎటువంటి అసహనం లేదు అని జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా రెండు పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయని, ఏ ఒక్కరిని తక్కువ చేయలేదని, ఇద్దరు కూడా సమానమే అని, అందువల్లే ఆర్ఆర్ఆర్ సినిమా అందంగా తీర్చిదిద్దబడింది అని ఎన్టీఆర్ అభిమానులకు క్లారిటీ ఇస్తూ వార్తలకు పుల్ స్టాప్ పెట్టేసారు.

ఇక సినిమాలోని కొమరం భీముడో పాటలో జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన హావభావాలకు థియేటర్స్ లో చిన్న పిల్లలు,అలాగే ఆడవారు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఆడియన్స్ పరంగా అభిమానులు ఎన్టీఆర్ లో నట విశ్వరూపం కనబడింది అని తెలియజేశారు. ఇకపోతే సినిమాలో సెకండాఫ్ వచ్చే సరికి ఎన్టీఆర్ పాత్ర పెద్దగా కనిపించలేదని, ఆ విషయం పట్ల ఎన్టీఆర్,ఎన్టీఆర్ అభిమానులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అటువంటి వార్తలు వస్తున్న సమయంలో సినిమాలు రెండు పాత్రలను రాజమౌళి సరిసమానంగా తెరకెక్కించాడు అంటూ ఎన్టీఆర్ కామెంట్లు చేయడంతో వివాదాలకు పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.