షాకింగ్ : సుకుమార్ కి బాలీవుడ్ స్టార్ దర్శకుడు మెసేజ్..”పుష్ప” ని ఓ రేంజ్ లో..

Pushpa The Rise Got Solid TRP

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా నిలబెడతానని దర్శకుడు సుకుమార్ తాను చెప్పినట్టుగానే పుష్ప చిత్రంతో నిలబెట్టాడు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో ముఖ్యంగా నార్త్ ఇండియా లో అయితే పుష్ప మ్యానియా ఇంకా నడుస్తుంది. ఆ రేంజ్ లో అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబో దుమ్ము లేపేశారు.

దీనితో ఇప్పుడు పుష్ప 2 పై భారీ స్థాయి అంచనాలు నెలకొనగా తాజాగా సినీ వర్గాల్లో ఓ షాకింగ్ మెసేజ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ మెసేజ్ ఎవరు పంపారో తెలుసా? హిందీలో భారీ వసూళ్లు ఉన్న పీకే, 3 ఇడియట్స్, లేటెస్ట్ గా గంగు బాయి ఖాతియా వాడి చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అట.

రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు సుకుమార్ కి ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ ని పంపడం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముందో సింపుల్ గా చెప్పాలంటే.. రాజ్ కుమార్ హిరాణీకి పుష్ప సినిమా చాలా నచ్చేసిందట. ఆ సినిమాకి సుకుమార్ డైరెక్షన్ గాని సినిమాలో సౌండ్ డిజైన్ గాని నటీనటుల పెర్ఫామెన్స్ లు గాని ప్రతి అంశం సూపర్ గా ఉన్నాయని తాను చెప్పారు.

అంతే కాకుండా సుకుమార్ నెంబర్ తన దగ్గర లేకపోవడంతో వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని మరీ మెసేజ్ చేసినట్టుగా తెలిపారు. అలాగే ఒకవేళ సుకుమార్ గాని హైదరాబాద్ వస్తే తప్పకుండా తనని కలవాలని కోరారు కూడా. దీనితో ఈ మెసేజ్ ఇప్పుడు సినీ వర్గాలు మరియు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.