Bollywood : వరుస సినిమాలతో జోరు పెంచిన బాలీవుడ్ హీరోలు!!

Bollywood : హిందీ సినిమాలు ఇండియాలోనే కాదు విదేశాల్లోను బాగా పాపులర్. కరోనా వల్ల సినిమాల సందడి తగ్గినా మళ్ళీ జోరు పెంచారు బాలీవుడ్ హీరోలు. కొంత కాలంగా దక్షిణాది సినిమాల జోరు బాలీవుడ్ లో పెరగడంతో కొంచెం డీలా పడిన తిరిగి తమ సత్తా చూపడానికి సిద్ధమయ్యారు.

బాలీవుడ్ బడా హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఈ ఏడాది మొదలై వచ్చే ఏడాది వరకు ఈ సందడి కొనసాగుతోంది. అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన లాల్ చద్ధ సింగ్ ఆగష్టు లో రానుంది. 2018 జీరో సినిమా తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మళ్ళీ సినిమా చేయలేదు. ఇపుడు తన కొత్త యాక్షన్ డ్రామా సినిమాతో ఫైర్ పెంచబోతున్నారు.

సిద్ధార్థ్ ఆనంద్ సినిమా పతాన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఇందులో షారుఖ్ కి జోడిగా దీపిక మరోసారి జతకట్టనుంది. ఇక జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నారు. మొదటిసారి జాన్ అబ్రహం తో కలిసి షారుఖ్ నటిస్తున్నారు. ఇక పొడవు జుట్టుతో షారుఖ్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంది మరియు సినిమాపై అంచనాలు పెంచింది.ఈ సినిమాను జనవరి 25 నా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

ఇక సల్మాన్ నటిస్తున్న టైగర్ 3 కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.మొదటి రెండు సినిమాలు విజయవంతం అవడం తో మూడో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో కూడా ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. కత్రినా కైఫ్ స్పై థ్రిల్లర్ గా నటించబోతోంది. వచ్చే ఏడాది ఈద్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక జాన్ అబ్రహం లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం అట్టాక్ పార్ట్ 1 కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో జాన్ అబ్రహం కు జోడి గా రకుల్ ప్రీతీ సింగ్, జాక్వలెనే ఫర్నేడెంజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం రెస్క్యూ ఆపరేషన్ కి సంబందించిన ఇండియన్ మొదటి సూపర్ సైనికుడి కథ ఆధారంగా తీయబడుతోంది. మార్చి 7 నా రిలీజ్ అయినా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.ఇక ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ డైరెక్టర్.

ఇక హృతిక్ రోషన్ నటిస్తున్న ఫైటర్ సినిమా కూడా లైన్లో ఉంది. ఈ సినిమా మొదటి ఇండియన్ ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఈ చిత్రం లో దేశభక్తి కి సంబందించిన అంశాలు కలవు. ఇక ఈ సినిమా లో హృతిక్ కు జోడి గా దీపిక పడుకొనే నటిస్తోంది.ఏజెంట్ అగ్ని గా కంగనా రానౌత్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘దక్కడ్’. ఈ సినిమా మొదటి పోస్టర్ విడుదల అయ్యాక సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ఇందులో అర్జున్ రామ్ పాల్, దివ్య దత్త్ లు కీలక పాత్రాల్లో నటిస్తున్నారు. ఇలా బాలీవుడ్ యాక్షన్ సినిమాలు సగటు సినిమా ప్రేక్షకుడిని ఊరిస్తున్నాయి.అయితే చూడాలి మరీ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో.