హైదరాబాద్ లో కంగనా రనౌత్.. 10 రోజులు అక్కడే మకాం.. అసలు ఏం జరుగుతోంది?

bollywood actress kangana ranaut arrives hyderabad

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఎవరు? అని అడిగితే టక్కున వచ్చే సమాధానం కంగనా రనౌత్. ఆ మధ్య కంగనా రనౌత్ గురించే వార్తలు. ముంబై.. పీవోకేలా ఉందని వ్యాఖ్యలు చేయడం.. ముంబైలో సేఫ్టీ లేదనడం.. తర్వాత తన ఆఫీసును ముంబై మున్సిపల్ అధికారులు కూల్చేయడం.. అబ్బో.. పెద్ద రచ్చే జరిగింది అప్పుడు. తనకు ప్రాణ హానీ ఉందని.. సెక్యూరిటీ కావాలంటే.. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై కెటగిరీ భద్రత కూడా కల్పించింది.

bollywood actress kangana ranaut arrives hyderabad
bollywood actress kangana ranaut arrives hyderabad

అయితే.. ఆ ఫైర్ బ్రాండ్ ప్రస్తుతం తెలంగాణలో అడుగుపెట్టింది. హైదరాబాద్ లో కంగనా మకాం వేసింది. 10 రోజులు ఇక్కడే ఉంటుందట. అందులోనూ ఆమె హైదరాబాద్ కు వచ్చిందన్న విషయాన్ని తెలంగాణ పోలీసులు కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఎవ్వరికీ చెప్పలేదు.

అదంతా ఓకే కానీ.. అసలు కంగనా హైదరాబాద్ కు ఎందుకు వచ్చింది? అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. ఇక ఈ వివాదాలు.. గివాదాలు వద్దు.. నా పనేదో నేను చేసుకుంటా.. అని అనుకున్నదో ఏమో.. కంగనా ఇక తన సినిమాలపై దృష్టి పెట్టింది. కంగనా ప్రస్తుతం తలైవి అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

bollywood actress kangana ranaut arrives hyderabad
bollywood actress kangana ranaut arrives hyderabad

ఆ షూటింగ్ కోసమే కంగనా హైదరాబాద్ లో అడుగు పెట్టింది. 10 రోజులు ఇక్కడే ఉండి షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక.. ఆమెకు ఉన్న వై కేటగిరీ భద్రతతో పాటుగా తెలంగాణ పోలీసులు కూడా ప్రత్యేకంగా భద్రత కల్పించారట. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్ లు మొదలవుతున్నాయి. కంగనా కూడా షూటింగ్ లో పాల్గొనక 7 నెలలు అవుతోందట. లాక్ డౌన్ తర్వాత ఇప్పుడే కంగనా షూటింగ్ లో పాల్గొనడం.