ఓటీటీలో కూడా ఒకేరోజు ప్రసారం అవుతూ పోటీకి సిద్ధమైన బింబిసారా, సీతారామం?

సాధారణంగా ఒకేరోజు రెండు మూడు సినిమాలు విడుదలతూ పెద్ద ఎత్తున థియేటర్ వద్ద పోటీకి నిలబడుతుంటాయి. ఈ విధంగా ఆగస్టు 5వ తేదీ థియేటర్లో ఒకేసారి విడుదలయి నువ్వా నేనా అన్నట్టు పూర్తిగా కలెక్షన్లను రాబట్టాయి బింబిసారా, సీతారామం సినిమాలు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైనప్పటికీ రెండు సినిమాలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇలా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగి రెండు సినిమాలు తమ సత్తా చాటుకున్నాయి.

ఇకపోతే థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత ప్రతి ఒక్క సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాల డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ జీ 5 భారీ ధరలకు కొనుగోలు చేశాయి.అయితే థియేటర్ దగ్గర పోటీకి దిగిన ఈ రెండు సినిమాలు డిజిటల్ మీడియాలో కూడా ఒకేసారి ప్రసారమవుతూ పోటీకి దిగబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బింబిసారా సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకోగా సీతారామం సినిమా హక్కులను అమెజాన్ సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలు థియేటర్లో ఒకేరోజు విడుదల కావడంతో ఓటీటీలో కూడా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగి మంచి హిట్ కొట్టిన ఈ రెండు సినిమాలు డిజిటల్ మీడియాలో ఎలాంటి విజయం సాధిస్తాయో తెలియాల్సి ఉంది.