బిగ్ బాస్ 4: హౌజ్‌లోకి రీఎంట్రీపై భిన్న క‌థ‌నాలు..రావడం లేటేమో కానీ రావడం మాత్రం పక్కా!

బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో సంచలనం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. పబ్లిక్ ఫేవరెట్ గా ఉన్న కుమార్ సాయిని ఇంట్లో నుంచి బయటకు పంపించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులను, వ్యాఖ్యత నాగర్జునను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు నెటిజన్లు. ఈ క్రమంలో షో రేటింగ్ కూడా తగ్గింది. కాగా షో ప్రారంభమైన 70 రోజులు పైగా గడిచిన నేపథ్యంలో ఊహించని విధంగా బిగ్ బాస్ లోకి కుమార్ సాయిని రీ ఎంట్రీ చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కుమార్ సాయిని పులిహార బ్యాచ్ లో లేకపోవడంతో బయటకి పంపారనే ముద్ర బిగ్ బాస్ పై పడింది దీంతో …అతడిని తిరిగి లోపలికి పంపించి..తప్పు దిద్దుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారట. మూడు సీజన్ల ద్వారా వచ్చిన మంచి పేరును నిలుపుకోవాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

సర్‌ప్రైజ్‌ కోసం ఇంట్లోకి సాయి :

నాలుగో సీజన్‌ను మరింత రంజుగా నడిపేందుకు బిగ్ బాస్ నిర్వహకులు ఈ ప్లాన్ అమలు చేస్తున్నారు. షో చివరి సగానికి చేరుకున్న నేపథ్యంలో ప్రేక్షకులకు మజాను పంచాలని బిగ్ బాస్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లలో ఒకరిని మళ్లీ ఇంట్లోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారట. వాస్తవానికి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని భావించినా..వివిధ కారణాల వల్ల దాన్ని ఆపేసి.. రీఎంట్రీనే ఇప్పించాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయిన పబ్లిక్ ఫేవరెట్ కుమార్ సాయి పేరు బయటకు వచ్చింది. రీఎంట్రీ కోసం తాజాగా అతడు బిగ్ బాస్ క్వారంటైన్ సెంటర్‌కు చేరుకున్నాడని ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజా అందుతోన్న సమాచారం ప్రకారం… కుమార్ సాయి రీఎంట్రీ ఇవ్వడం పక్కా అని, అతడిని ఎప్పుడు హౌస్‌లోకి పంపించాలన్న దానిపై షో నిర్వహకులు ఇంకా టైమ్ ఫిక్స్ చెయ్యలేదట. అయితే, వచ్చే వారం మాత్రం అతడు గ్రాండ్ గా ఇంట్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వారం మొత్తం కుటుంబ సభ్యుల ఎంట్రీలు ఉంటుంది కాబట్టి, వచ్చేవారం సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకుంటున్నారట.