ఓటిటిలోకి వచ్చేస్తున్న గోపీచంద్‌ ‘భీమా’ టాలీవుడ్‌

మాచో స్టార్‌ గోపీచంద్‌ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీ లాక్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఏప్రిల్‌ 25 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్టీమ్రింగ్‌ కానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మించగా.. ‘సలార్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందించాడు. ప్రియాంక భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా అలరించిన ఇందులో వెన్నెల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌ కీలకపాత్రల్లో నటించారు.