అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత పూరి జగన్నాధ్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్న చరణ్..?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకోబోతోంది. ఇంతకు ముందు రాజమౌళి – రాం చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియోట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ తో చరణ్ పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకోబోతున్నాడని మెగా ఫ్యాన్స్ ఫిక్సైపోయారు. ఇక కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

New Year Surprise From RRR???

ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీచి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో జాయిన్ కానున్నాడు. 20 రోజుల్లో ఆచార్య పూర్తి చేసేలా కంటిన్యూ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆర్ ఆర్ ఆర్ లాంటి మల్టీస్టార్ తర్వాత పక్కా కమర్షియల్ సినిమా చేయాలని చరణ్ భావిస్తున్నట్టు తాజా సమాచారం. అందుకే చరణ్ పూరి జగన్నాధ్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ని హీరోగా లాంచ్ చేసింది పూరి జగన్నాధ్. చిరుత సినిమా ద్వారా గ్రాండ్ ఇచ్చిన రాం చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో స్టార్ గా సెటిలైపోయాడు. కాగా మళ్ళీ ఇన్నాళ్ళకు రాజమౌళి సినిమా ఆ తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలనుకోవడం మెగా అభిమానులకి పెద్ద సర్‌ప్రైజింగ్ గా ఉందంటున్నారు. ఇప్పటికే చరణ్ తో సినిమా చేసేందుకు పలువురు దర్శకులు క్యూలో ఉన్నప్పటికి పూరి అయితే సరిగ్గా 4 నెలల్లో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తాడని చరణ్ పూరి తో సినిమా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.