IPL 2025: ఐపీఎల్ వేదికగా బుకీల మాయ? బీసీసీఐ వార్నింగ్‌తో కలకలం

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ ఒక్కసారిగా వేడి పుట్టిస్తోంది. ఆట మైదానంలో కాక, ఈసారి మైదానం వెలుపల. బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీఎస్‌యూ) తాజా హెచ్చరికలతో క్రికెట్ వర్గాల్లో గందరగోళం మొదలైంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి బుకీతో సంబంధాల్లో ఉన్నాడని, అతడి నుంచి జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ కఠినంగా హెచ్చరించింది. ఈ హెచ్చరికలు కేవలం ఆటగాళ్లకే కాకుండా, కోచ్‌లు, కామెంటేటర్లు, సహాయక సిబ్బంది వరకు చేరాయి.

పెద్దగొడవేంటంటే.. అభిమాని వేషంలో ఉండే ఈ వ్యాపారి, మ్యాచ్ స్టేడియాల్లోనూ, జట్లు బస చేసే హోటళ్లలోనూ సంచరిస్తూ, వ్యక్తులతో పరిచయాలు పెంచుతున్నాడట. ఖరీదైన బహుమతులు, ఆభరణాలు వంటి వాటితో ఆకర్షణ పెంచుతూ, తన పరిధిని విస్తరిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లోని ప్రముఖులతో స్నేహం చేసేందుకు, దగ్గర కావడానికి చేస్తున్న ఈ ప్రయత్నాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటో అనుమానాలు కలుగుతున్నాయి.

అంతేకాదు, ఆ వ్యక్తి తన స్వార్థానికి అనుకూలంగా పనిచేయించేందుకు ఒత్తిళ్లు కూడా తెస్తున్నాడట. ఇది కేవలం నేరస్త పనులకే దారి తీస్తుందన్న సందేహం బలపడుతోంది. బీసీసీఐ నుంచి ఈ రేంజ్‌లో హెచ్చరిక రావడమే మామూలు విషయం కాదు. ఆటపై ఇలాంటి వ్యవహారాలు భయానక మచ్చలుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఈ వ్యాపారి ఎవరనే చర్చ వేడెక్కుతోంది. ఎవరి పేరూ అధికారికంగా బయటకు రాకపోయినప్పటికీ, అభిమానుల్లోనూ, క్రికెట్ సర్కిల్‌లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. బుకీల చీకటి బలాలు మళ్లీ క్రికెట్‌ను తాకబోతున్నాయా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. బీసీసీఐ తీసుకున్న చర్యలు ఎంతవరకు ప్రయోజనకరంగా మారుతాయో చూడాలి.

సోనియా, రాహుల్ || Analyst Ks Prasad Reacts On Sonia, Rahul Gandhi in National Herald Case || TR