బాలకృష్ణకు స్టార్ అనే అహం లేదు

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ కు ఈ మధ్యకాలంలో బాలకృష్ణతో ఎంతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు అల్లు అరవింద్ బాలకృష్ణ మధ్య మంచి బాండింగ్ ఉండడంతో అల్లు అరవింద్ కు సంబంధించిన అన్ని ఈవెంట్లకు బాలయ్య ముఖ్యఅతిథిగా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ నిర్వహిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి బాలకృష్ణను వ్యాఖ్యాతగా ఆహ్వానించారు తాజాగా ఆయన కుమారుడు అల్లు శిరీష్ నటిస్తున్న ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్యఅతిథిగా వచ్చారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద బాలకృష్ణ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ గారితో ఏ పనైనా ఐదు నిమిషాలలో పూర్తి అవుతుందని తెలిపారు. అన్ స్టాపబుల్ కోసం బాలకృష్ణ గారితో ఫోన్ చేసి మీరు వ్యాఖ్యాతగా ఉండాలి అని అడగాలి వెంటనే టీం పంపించండి అని చెప్పారు. టీ మొత్తం వెళ్లగానే తనకు నచ్చిందని, తర్వాత విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం అని తెలిపారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం రమ్మని అడగగా ఎవరు మన శిరీష్ కదా తప్పకుండా వస్తా అంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చారని తెలిపారు. ఈయన స్టార్ హీరో అయినా ఏమాత్రం బిల్డప్ చూపించారని ఏ విషయం అయినా ముక్క సూటిగా మాట్లాడుతారని తెలిపారు. అంత సింపుల్ యాటిట్యూడ్ ఉన్న బాలకృష్ణకు అందరూ అభిమానులే అంటూ బాలయ్య గురించి అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించారు.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినందుకు బాలయ్యకు అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.