అప్పుడే ఓటిటిలో “బలగం”..ఫైరవుతున్న ఆడియెన్స్.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి సెన్సేషనల్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో వసూళ్లు మరియు కంటెంట్ తో కొట్టిన సినిమా “బలగం” కూడా ఒకటి. యంగ్ నటుడు ప్రియా దర్శి అలాగే కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించడం విశేషం.

కాగా ఈ సినిమా చాలా తక్కువ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి నిర్మాత దిల్ రాజు పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా గడిచిన ఈ 20 రోజుల్లో సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తోంది. అయితే ఇప్పటికి 22 కోట్లు అందుకున్న ఈ సెన్సేషనల్ బాక్సాఫీస్ హిట్ అనూహ్యంగా ఇప్పుడు ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసుకోవడం షాకింగ్ గా మారింది.

ఈ సినిమా రేపే అంటే మార్చ్ 24 నుంచే ఓటిటి లో వచేస్తుంది అని కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రావడానికి ఫిక్స్ అయ్యింది. అలాగే దీనితో పాటుగా సింప్లి సౌత్ లో అయితే ఓవర్సీస్ ఆడియెన్స్ కి అందుబాటులో ఉండనుంది.

దీనితో ఈ షాకింగ్ న్యూస్ చూసిన నెటిజన్స్ నిన్ననే థియేటర్స్ లో చూసిన ఆడియెన్స్ దిల్ రాజు సినిమా యాజమాన్యం విషయంలో ఫైర్ అవుతున్నారు. నిన్న కూడా 1 కోటికి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా ఇంతలోనే ఓటిటి లో ఏంటా అని షాక్ అవుతున్నారు.

కాగా సినిమాకి ఉన్న అగ్రిమెంట్ తో అయితే ఓటిటి లో తప్పడం లేదని ఇప్పుడు తెలుస్తుంది. కాగా మూడు వారాల్లోనే సినిమా వచ్చేస్తుంది. అయితే ఇలా వచ్చినా కూడా ఎన్నో సినిమాలు థియేటర్లు లో అదరగోట్టాయి ఇది కూడా అలాగే రాణిస్తుంది అని చెప్పడంలో డౌట్ లేదు.