బిగ్ బాస్ 4 కి రావాలనుకున్న ఎన్.టి.ఆర్ కి వాళ్ళు షాకిచ్చారా ..?

బుల్లితెర బిగ్ షో బిగ్ బాస్ 4 అఖరి అంకానికి చేరుకుంది. విన్నర్ ఎవరన్న దానిపై సర్వత్రా అసక్తి నెలకొంటోంది. ఇదిలా ఉంటే గ్రాండ్ ఫినాలేను జబర్దస్త్ గా జరిపేందుకు హోస్ట్ అక్కినేని నాగార్జున బారీ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకులను అలరించేందుకు వీలైనన్ని స్పెషల్ సెగ్మెట్స్‌ను ఇంట్రడ్యేజ్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పటికే మెహ్రీన్, లక్ష్మీరాయ్ లతో ప్రత్యేక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ను ఆదివారం కోసం రెడీ చేశారు. ఇక ఫినాలేలో విజేతను ప్రకటించే టాప్ సెలబ్రిటీ ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు.

బిగ్ బాస్ 4 కి రావాలనుకున్న ఎన్.టి.ఆర్ కి వాళ్ళు షాకిచ్చారా ..?

గత సీజన్‌ లో బిగ్‌ బాస్ 3 గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా చిరంజీవి హాజరయ్యారు.. ప్రేక్షకులను అలరించారు. ఈ సీజన్ లో గెస్ట్ గా ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది. ఆయనే గెస్ట్ గా రాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఈ సారి చిరంజీవి, ఎన్టీర్ ఇద్దరూ ఫినాలేలో హంగామా చేస్తారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దాదాపు ఈ ఇద్దరు ఛీఫ్ గెస్ట్ లు అని అంటున్నారు. నాగర్జున ఫినాలే గెస్ట్ గా ఎవరిని తీసుకువస్తారన్న టాక్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.

అయితే ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తరన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ జెమినితో కలిసి చేసుకున్న ఒప్పందమే అందుకు కారణంగా కనిపిస్తోంది. ఓ షో జెమినితో టీవీతో చేస్తానని ఎన్టీర్ ఒప్పందం చేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. జెమిని కోసం షో చేస్తూ..మా టీవీలో షోకు గెస్ట్ గా పాల్గొనడం కుదరకపోవచ్చునని టాక్. దీంతో బిక్‌ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కనిపించరని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బిగ్ బాస్ ఫినాలేకు ఎన్టీఆర్ రావాలని ఉన్నా..ఒప్పందం ప్రకారం జెమినీ టీవీ వారు ఒప్పుకోకపోవచ్చునని..ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి షాకే అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.