నెక్స్ట్ ఇయర్ నాదే అంటున్న అనుపమ పరమేశ్వరన్

anupama parameswaran doing three telugu movies

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా దూసుకుపోతుంది. వరుస సినిమాలు చేస్తూ మంచి ఊపులో ఉంది. ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటుగా ఒక తమిళ్ సినిమా కూడా ఉంది. తమిళ్ హీరో అధర్వ సరసన తెలుగు మూవీ ‘నిన్ను కోరి’ రీమేక్ “తల్లి పొగాతె ” మూవీ వచ్చే ఏడాది జనుఅరీ లో రిలీజ్ అవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే యంగ్ హీరో నిఖిల్ హీరోగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “18 పేజీస్” చిత్రంలో అనుపమ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

anupama parameswaran doing three telugu movies
anupama parameswaran

మరోవైపు దిల్ రాజు బంధువు ఆశిష్ రెడ్డి హీరోగా శ్రీ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ బాయ్స్’ లోను అనుపమ హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇది కాక ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మలయాళ చిత్రం హెలెన్ రీమేక్ విషయంలోనూ అనుపమ క్లారిటీ ఇచ్చింది. పివివి సంస్థతో కలిసి దిల్ రాజు సంయుక్తంగా నిర్మించే హెలెన్ రీమేక్ లోను తాను నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే వచ్చే ఏడాది అనుపమ మొత్తంగా నాలుగు సినిమాలతో సందడి చేయబోతోంది. అంటే 2021 వ సంవత్సరం అంతా అనుపమా హడావిడే ఉంటుందన్నమాట.