Andrea Jeremiah:గోల్డెన్ వీసా అందుకున్న హాట్ బ్యూటీ ఆండ్రియా..!

Andrea Jeremiah: తమిళ చలన చిత్ర పరిశ్రమలో బోల్డ్ నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆండ్రియా. ఈమె తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకుంది. కార్తీ హీరోగా నటించిన’యుగానికి ఒక్కడు’, అలాగే లోకనాయకుడు,కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ప్రస్తుతం ఆండ్రియా, మిష్కిన్‌ దర్శకత్వం వహిస్తున్న పిశాచి 2 లో నటిస్తోంది.

తాజాగా ఆండ్రియాను దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో సత్కరించింది.అయితే ఈ గౌరవం అందరిని వరించదు.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కొంత మంది సెలబ్రిటీలు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు.బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, సంజయ్‌ దత్ ,కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి ,సింగర్స్‌ సోనూ నిగమ్‌, నెహా కక్కర్‌, బుల్లితెర హాట్‌ బ్యూటీ మౌనీ రాయ్‌, ఫరా ఖాన్‌, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్‌ కుటుంబం గోల్డెన్ వీసాను అందుకున్నారు. అలాగే మమ్ముట్టి, మోహన్‌లాల్, పార్తిబన్, త్రిషా, అమలాపాల్, కాజల్ అగర్వాల్ వంటి తదితర సెలబ్రిటీలు కూడా గోల్డెన్ వీసా దక్కించుకున్నారు. ఇక మెగా కోడలు ఉపాసన కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ మధ్యనే నటి మీనా కూడా ఈ జాబితాలో చేరిపోయారు.

ఈ విధంగా గోల్డెన్ వీసా ను అందుకున్న వారు పది సంవత్సరాలపాటు ఆ దేశంలో వారసత్వాన్ని కలిగి ఉంటారు. అయితే తాజాగా ఈ గోల్డెన్ వీసా అందుకున్న నటి ఆండ్రియా యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది. దుబాయ్ ప్రభుత్వం 2019 నుండి గోల్డెన్ వీసాలతో సత్కరిస్తోంది.