నవదీప్‌కు పెళ్లి కాలేదు కాబట్టి వెళ్తాడు.. అనసూయ భర్త అలా అనేశాడట!

నవదీప్ ఈ మధ్య హిమాలయకు వెళ్లి వచ్చాడు. అయితే ఈ సంగతి అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఆయన సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయ్యే వారికి ఆ విషయం తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి బైకులు తీసుకుని రోడ్డు ట్రిప్ వెళ్లారు. అలా హిమాలయాలకు చేరుకున్నారుట. ఇదేమీ మొదటి సారి కాదట. ఇంతకుముందే ఓ రెండు సార్లు వెళ్లారట. మొత్తానికి నవదీప్ ఇలా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు.

Anasuya And Sushank Bharadwaj Comments On Navdeep Himalaya Trip
Anasuya And Sushank Bharadwaj Comments On Navdeep Himalaya Trip

ఇదే విషయాన్ని అనసూయ భర్త సుశాంత్ కూడా అన్నాడట. తాజాగా నవదీప్, అనసూయ లైవ్‌లోకి వచ్చారు. వారిద్దరి ముచ్చట్లు బాగానే వైరల్ అవుతున్నాయి. మొదటగా నవదీప్‌ ఇన్ స్టా లైవ్‌లోకి వచ్చాడు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుండగా మధ్యలో అనసూయ వచ్చి చేరింది. వచ్చీ రావడంతో అనసూయ హిమాలయాల ట్రిప్‌ గురించి అడిగింది.

Anasuya And Sushank Bharadwaj Comments On Navdeep Himalaya Trip
Anasuya And Sushank Bharadwaj Comments On Navdeep Himalaya Trip

‘ఎంతమంది వెళ్లారు నవదీప్‌’ అని అనసూయ ప్రశ్నించింది. 14 మంది కలిసి, ఆరు బైక్‌ల మీద వెళ్లామని అది ఐదు రోజుల ట్రిప్‌ ఇలా మొత్తం డేటా నవదీప్ చెప్పాడు. తాను ఇప్పటి వరకు మూడుసార్లు హిమాలయాలకు వెళ్లానని, బైక్‌పై అక్కడ రైడ్‌కు వెళ్లడం రెండుసార్లు అని చెప్పాడు. భార్య, గర్ల్‌ఫ్రెండ్‌ లేకపోతే ఇలా సంతోషంగా వెళ్లొచ్చు అని ఓ సెటైర్ కూడా వేశాడు. దీనికి అనసూయ స్పందిస్తూ.. మా ఆయన కూడా అదే అంటున్నాడని మరో బాంబ్ పేల్చింది. నవదీప్‌కు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. కాబట్టి హ్యాపీగా వెళ్తాడు అని అన్నాడట. ఏ నువ్వు పెళ్లి చేసుకున్నందుకు ఫీల్‌ అవుతున్నావా? అని భర్తపై కోపంగా అనసూయ కసిరిందట. మొత్తానికి నవదీప్ ఇలా ఎంజాయ్ చేస్తుండటం మాత్రం అందరి కంటపడుతోందన్నమాట.