ఈ వేసవిలో షాపింగ్ హంగామాకు అమెజాన్ రెడీ అయ్యింది. మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ‘గ్రేట్ సమ్మర్ సేల్’ ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్లకు అయితే ప్రత్యేకంగా ఏప్రిల్ 30 అర్ధరాత్రి నుంచే షాపింగ్ చేసే అవకాశం కల్పించారు. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు ఆఫర్లతో చిలిపించారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ అసలు ధర రూ.1,34,999 ఉండగా, ఇప్పుడు కేవలం రూ.84,999కే లభిస్తోంది. ఐఫోన్ 15 బేస్ మోడల్ను రూ.57,749కి అందుబాటులో ఉంచనున్నారు. వన్ప్లస్ 13ఆర్ 5జీ రూ.39,999కి, ఐకూ నియో 10ఆర్ 5జీ రూ.24,999కి అందుబాటులోకి రాబోతున్నాయి.
బడ్జెట్ కస్టమర్ల కోసం కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ రూ.13,999కు, రియల్మీ నార్జో 80ఎక్స్ 5జీ రూ.11,999కు, టెక్నో పాప్ 9 ఫోన్ కేవలం రూ.5,490కి లభించనుంది. అలాగే షామీ 14 సీవీ రూ.32,999కు, వన్ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ మోడల్ రూ.15,999కి సేల్లో దొరకనుంది.
కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాదు, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది. అలాగే అమెజాన్ పే-ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. పాత ఫోన్ మార్పిడి ఆఫర్, వడ్డీలేని ఈఎంఐ అవకాశాలు కూడా ఉన్నట్లు అమెజాన్ తెలిపింది.
స్మార్ట్ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, టీవీలు, ఎయిర్ కండీషనర్లు వంటి ఎన్నో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ఈ సేల్లో భారీ తగ్గింపులు ఉన్నాయి. మరింత ఎక్కువ ఆఫర్లు, ఉత్పత్తుల వివరాలు సేల్ ప్రారంభానికి ముందు అమెజాన్ వెల్లడించనుంది.