తారక్, చరణ్ క్లాష్.. మధ్యలో బన్నీ?

భారీ అంచనాలున్న రెండు సినిమాలు ఒకే విడుదల తేదీని టార్గెట్ చేయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్కంఠ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ చిత్రం, రామ్ చరణ్ 15వ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ రెండూ 2024 ఏప్రిల్ 5 విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మరోవైపు పుష్ప 2 కూడా అదే ఏడాది మార్చి 30న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

టాలీవుడ్‌లోని ముగ్గురు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకే రిలీజ్ డేట్‌ని టార్గెట్ చేయడంతో బాక్సాఫీస్‌పై గట్టి పోరు తప్పలేదు. అయితే ఈ పోటీలో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి. ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇద్దరూ భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ పాన్ ఇండియా స్టార్స్. ఇక అత్యంత విజయవంతమైన RRRతో ఇద్దరు కలిసి విజయాన్ని షేర్ చేసుకున్నారు.

అయితే ఈసారి ఈ రకమైన క్లాష్ కాస్త ఫ్యాన్స్ లో హై టెన్షన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇక పుష్ప భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ కూడా అంతే విజయవంతమవుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక పోటీ ఖచ్చితంగా ఉంటే మాత్రం ముడు సినిమాలకు సమస్య అవుతుంది.

ఏదేమైనా కూడా రాబోయే నెలల్లో అభిమానులు కొన్ని అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఎంజాయ్ చేయవచ్చు. అనవసరంగా డేట్స్ క్లాష్ కాకుండా విడుదలైతే హీరోల ఫ్యాన్స్ అలాగే నిర్మాతలు కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కాబట్టి తప్పనిసరిగా అందరూ ఆ డేట్స్ కావాలని అంటారు. మరి 2024 సమ్మర్ ఏ విదంగా ఉంటుందో చూడాలి.