సరిహద్దులలో జవాన్ లతో కలిసి సందడి చేసిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంతకాలం కేవలం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇలా వరుస సినిమాలతో కమర్షియల్ యాడ్స్ షూటింగ్స్ తో బిజీగా ఉండే అల్లు అర్జున్ కుటుంబం కోసం కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో కుటుంబంతో కలసి తరచూ విదేశాలలో
వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటీవల అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలిసి పాకిస్థాన్ సరిహద్ధు వాఘా చెక్ పోస్ట్ వద్ద సందడి చేశారు. ఎప్పుడు వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లే ఈ జంట ఇప్పుడు మాత్రం స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పంజాబ్ లోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఆ తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్తాన్ బోర్డర్ వాఘా సరిహద్దుకు వెళ్లి అక్కడ ఆర్మీ జవానులతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలో ప్రతి రోజు సాయంత్రం బీఎస్ఎఫ్ జవాన్లు చేసే కవాతులో అల్లు అర్జున్ గౌరవ అతిథిగా పాల్గొన్నాడు. ఇక ఆ సందర్భంలో జవాన్లు లతో కలిసి ఫోటోలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.